జోగులాంబ గద్వాల : రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరు లేరు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నటుడు ఆర్. నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల వల్ల ప్రజలకు జరిగే నష్టం గురించి రైతన్న సినిమాలో వివరించామని, ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూసి ఆదరించాలని కోరారు. వ్యవసాయం దండగ కాదని పండుగని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తే రైతులకు 50 శాతం లాభం చేకూరుతుందన్నారు. రైతులు పండించిన పంటకు (msp) మద్దతు ధర ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు వెంకటస్వామి, మధుసూదన్ బాబు, ఇక్బాల్ పాషా ప్రభాకర్, ఆలూరు ప్రకాష్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు