కేతేపల్లి, జూలై 29 : సాదాసీదా పాఠశాల గోడలను విద్యార్థుల విజ్ఞానం పెంపొందేలా, పిల్లలు అక్షరాలు, అంకెలు, సైన్స్, గణితం నేర్చుకోవడానికి సహాయపడే ఆహ్లాదకరమైన, దృశ్యపరమైన అభ్యాస ప్రదేశాలుగా మార్చారు. అంకిత భావంతో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జడ్పీహెచ్ఎస్ పాఠశాల గోడలు కూడా విద్యార్థులకు ఇప్పుడు విజ్ఞానాన్ని పంచుతున్నాయి. అంతర్గత గోడలను సైతం విద్యార్థులకు విజ్ఞానం పెంపొందిస్తూ వినోదం పంచేవిగా తీర్చిదిద్దారు. కస్తూరి ఫౌండేషన్ ఛైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సౌజన్యంతో రూ.50 వేల వ్యయంతో పాఠశాల గోడలపై బొమ్మలు వేయడం జరిగింది.

విద్యార్థుల మనసులను ఉత్తేజపరిచేలా భీమవరం జడ్పీహెచ్ఎస్లో గోడ చిత్రలేఖనం
పాఠశాల ఆవరణలోని తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు అనుగుణంగా బొమ్మల రూపంలో అక్షరాలు, గుణింతాలు, దేశ, రాష్ట్ర చిహ్నాలు, దేశ నాయకులు తదితర వాటిని చిత్రీకరింపజేశారు. గోడలు బోధించడం మొదలు పెట్టినప్పుడు తరగతి గదులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని, ఇది విద్యార్థులకు విషయాలను గుర్తుంచుకోవడానికి, నైపుణ్యాలను అభ్యసించడానికి, తమ పాఠశాల పట్ల గర్వపడేలా చేయడానికి సహాయ పడుతుందని, బొమ్మలను అనుదినం చూస్తుండటం వల్ల వాటిని మననం చేసుకుని ఎప్పటికీ గుర్తుండి పోతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భిక్షమయ్య అన్నారు.

విద్యార్థుల మనసులను ఉత్తేజపరిచేలా భీమవరం జడ్పీహెచ్ఎస్లో గోడ చిత్రలేఖనం
– రేఖాచిత్రాలు, కాలపట్టికలు, సంఖ్యా రేఖలు, పటాలు, పాఠ్యాంశాలను పునశ్చరణ చేయడం
– పజిల్స్, చిన్న ప్రశ్నలు, వెతికి కనుగొనే అంశాలతో ఉత్సుకతను ప్రేరేపించడం
– విలువలు, క్లబ్లు, విజయాలను ఒకే దృశ్య కథనంలో చూపించడం ద్వారా పాఠశాల సంస్కృతిని చాటిచెప్పడం
– వివిధ జోన్ల గోడలకు ఉద్దేశపూర్వకంగా రంగులను ఎంచుకోవడం ద్వారా ప్రశాంతతను లేదా ఉత్సాహాన్ని సృష్టించడం
– సృజనాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది
– తరగతి గది సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది
– విలువలు, పాఠాలను తెలియజేస్తుంది.

విద్యార్థుల మనసులను ఉత్తేజపరిచేలా భీమవరం జడ్పీహెచ్ఎస్లో గోడ చిత్రలేఖనం

విద్యార్థుల మనసులను ఉత్తేజపరిచేలా భీమవరం జడ్పీహెచ్ఎస్లో గోడ చిత్రలేఖనం