భీమారం, మార్చి 17 : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గోదాం తాళాలు పగలగొట్టిన 40 క్వింటాళ్ల ధాన్యం ఎత్తుకెళ్లారు. అదే సమయంలో స్థానికులు అటువైపుగా రావడంతో 52 సంచులను వదిలి పరారయ్యారు. ఆపై స్థానికులు దుర్గా ఇండస్ట్రీ యజమాని దర్శనాల రమేశ్కు సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులు టాటాఏస్ వాహనంతో వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.