పెద్దపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందిన యువకులు.. తొలి ఓటును బీఆర్ఎస్కే వేస్తామని స్పష్టం చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు. కారు గుర్తుకు ఓటేసీ కేసీఆర్ సర్కారును మళ్లీ తెచ్చుకుంటామని నినదించారు.
శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 50 మంది నూతన ఓటర్లు స్థానిక జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై.. గులాబీ పార్టీలోకి నవ యువకులు రావడం అభినందనీయమని చెప్పారు.