హైదరాబాద్ : అడవి పిల్లిని(Wild cat) చూసి చిరుత పులి పిల్ల అనుకొని స్థానికులు భయాందోళనకు గురైన సంఘన మేడ్చల్ జిల్లా(Medchal) గాజుల రామారం డివిజన్ పరిధి కైసర్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కైసర్నగర్లోని డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన నీటి సంపులో అడవి పిల్లి (జంగల్ క్యాట్) బుధవారం ఉదయం ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. అయితే దానిని పులి పిల్లగా భావించి స్థానిక యువత అప్రమత్తమై దాన్ని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
కాగా, చిరుత పులిని పోలిన అడవి పిల్లిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారని, వాస్తవానికి అది చిరుత పులి కాదని అడవి పిల్లి అని ఫారెస్ట్రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) లక్ష్మణ్ తెలిపారు. భౌరంపేట్కు చెందిన రాకేష్ అనే వ్యక్తి గత 15 రోజుల క్రితమే తన ఫామ్ నుంచి అడవి పిల్లి తప్పిపోయిందని ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి తాము సైతం తప్పిపోయిన అడవి పిల్లి కోసం వెతుకుతున్నామన్నారు. బుధవారం అడవి పిల్లి దొరకడంతో దానిని రాకేష్కు తిరిగి అప్పగించామని లక్ష్మణ్ తెలిపారు.
హైదరాబాద్లో ప్రత్యక్షమైన అడవి పిల్లి
గాజుల రామారంలో చెట్ల పొదల్లో కనిపించిన చిరుతపులిని పోలిన అడవి పిల్లి.. అడవి పిల్లిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించిన స్థానికులు. pic.twitter.com/FCdKR72ORV
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2024