హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాక్సిన్ పాలసీ అవార్డు భారత దేశానికి దక్కుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ.. ప్రభుత్వం కావాల్సినన్ని డోసులకు ఆర్డర్ ఇవ్వలేదన్నారు. దేశంలో కేవలం రెండు శాతం జనాభా మాత్రమే రెండు వ్యాక్సిన్ డోసులను పొందారన్నారు. వ్యాక్సిన్లకు రాష్ట్రాలు బలవంతంగా అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందన్నారు.
అయినప్పటికీ రాష్ట్రాలు కేవలం 25 శాతం వ్యాక్సిన్లను మాత్రమే పొందాయన్నారు. జనాభాలోని 74.35 శాతానికి వ్యాక్సిన్లు వేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. కాగా 25 శాతం డోసులను మాత్రమే నేరుగా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా మరో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు ప్రత్యేకంగా కేటాయించారన్నారు.
క్వార్ట్జ్ నివేదిక ప్రకారం. భారతదేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి వ్యయం రూ.30 నుండి రూ.80 వరకు ఉంటుందంది. ఇదే సరైనదైతే రూ.150 నియంత్రిత ధర ఇప్పటికే డోసుకు 188 శాతం నుండి 500 శాతం వరకు లాభాలను అందించిందన్నారు.
ప్రధానమంత్రి, అమిత్ షా ఎక్కడున్నారు? దేశవాసులు బాధపడుతున్నప్పుడు ఈ రెండు కంపెనీలు మాత్రమే ఎందుకు లాభం పొందుతున్నాయి? వారు ఎటుపోయారు? తప్పించుకునేందుకు వారు ప్రయత్నించవచ్చు. కానీ ఈ నిశ్శబ్ద గోడ వెనుక వారు దాచుకోలేరన్నారు. ఈ దుఃఖం, వినాశనానికి వారు జావాబుదారితనం వహించాల్సి ఉంటుందని అసదుద్దీన్ పేర్కొన్నారు.