నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్మికులు.. తమకు బిల్లులు రావడం లేదని సమ్మె చేస్తున్నారు. దీంతో పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఎవరూ లేకపోవడంతో ఉపాధ్యాయులు చొరవ చూపారు.
మంగళవారం స్వయంగా ఉపాధ్యాయులే వంట చేసి విద్యార్థులకు వడ్డించి ఆకలి తీర్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను అభినందించారు.