ఖిల్లాఘణపురం, మే 27 : అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోగా బుధవారం నిరంజన్రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆశపడి మోసపోయారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి నెల అవుతున్నా.. నేటికీ తూకంలో, ట్రాన్స్పోర్ట్లో అలసత్వం కనిపిస్తున్నదని, ఇందుకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు.