ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada Ajay kumar) అన్నారు. మే డే సందర్భగా సోమవారం ఖమ్మం ఏఎంసీ ఆవరణలోని బీఆర్ఎస్కేవీ సంఘం కార్యాలయంతో పాటు పలుచోట్ల కార్మిక జెండాలను ఆవిష్కరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
సంఘటిత, అసంఘటిత రంగాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్(CM KCR) శ్రమిస్తున్నారని వెల్లడించారు. దేశ ప్రగతికి పారిశ్రామిక అభివృద్ధే(Industrial Growth) గీటురాయి అన్నారు. పింఛన్లు, ఇండ్లు, దళితబంధు పథకంలో కార్మికులకు(Workers) మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రూ.6 లక్షల ప్రమాద బీమా(Accidental Insurance) కల్పిస్తున్నామన్నారు. కార్మికుల ఇంట్లో పెండ్లికి రూ.30 వేలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR )కృషితో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. తద్వారా వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారన్నారు.మే డే సందర్భంగా 3 వేల మంది ఏఎంసీ కార్మికులకు యూనిఫాంలు అందజేశారు.
కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ దోరెపల్లి శ్వేత, వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ ట్రాలీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నున్నా మాధవరావు తదితరులు పాల్గొన్నారు.