కుమ్రం భీం ఆసిఫాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. కౌటాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రో రైతు సేవా కోనప్ప ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వ పరంగా వచ్చే విత్తనాలు, ఎరువులు, పనిముట్లు సబ్సిడీలో ఈ కేంద్రంలో లభిస్తాయన్నారు.
రైతులకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌటాల, చింతలమానేపల్లి ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య, డీసీఎంస్ వైస్ చైర్మన్ మాంతయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.