హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమాను చూసి నిర్ణయం తీసుకునేలా ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ప్రతిపాదనపై వాదప్రతివాదనలు జరిగాయి. ఒకసారి సెన్సార్బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక మరో కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చెల్లదని నిర్మాత తరఫు సీనియర్ న్యాయవాది ఏ వెంకటేశ్ చెప్పారు. కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు ఇచ్చామని సెన్సార్బోర్డు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ తెలిపారు. వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.