చింతకాని, మార్చి 11: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా రైలు ఇంజిన్ ముందుభాగం పాక్షికంగా దెబ్బతిన్నది. దీంతో రైలు సుమారు 40 నిమిషాల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. రైల్వేశాఖ సిబ్బంది, మెకానిక్లు హుటాహుటిన వెళ్లి ఇంజిన్కు మరమ్మతులు చేశారు. ఆ తరువాత రైలు ముందుకు కదిలింది.