హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : మూడు దశాబ్దాలుగా పరారీ లో ఉన్న ఇద్దరు నిం దితులను తెలంగాణ సీఐడీ పోలీసులు శు క్రవారం అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఒకరు నకిలీ సర్టిఫికెట్లతో సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు ఇప్పించి, దాదాపు 31 ఏండ్లుగా పరారీలో ఉన్న పల్లె సారయ్య కాగా, మరో నిందితుడు ట్రావెన్ కోర్ ఫైనాన్స్ కేసులో ప్రజలను మోసం చేసిన కేరళకు చెందిన కే రామన్ పిైళ్లె. ఇతను కూడా సుమారు 29 ఏండ్లుగా పరారీలో ఉన్నాడు. వీరిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు కాగా, పోలీసుల కండ్లుగప్పి తిరుగుతున్నారు.
గోదావరిఖని, మందమర్రి, ఇందారంఖనికి చెందిన నిందితుడు పల్లె సారయ్య నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు ఇప్పించాడు. ఆఖరికి ఆ సంస్థ జనరల్ మేనేజర్ సంతకాలు కూడా ఫోర్జరీ చేశాడు. 1992లో అప్పటి ఎస్సీసీ ఎండీ ఇంద్రజిత్ పాల్ (ఐఏఎస్) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి, పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన పల్లెసారయ్యను శుక్రవారం అరెస్టు చేసి, ఆదిలాబాద్లోని జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చారు. మరో కేసులో ట్రావెన్ కోర్ ఫైనాన్స్ పేరిట లక్షల రూపాయల డిపాజిట్లతో ప్రజలను మోసం చేసిన కేరళకు చెందిన కే రామన్ పిైళ్లెని సైతం సీఐడీ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐడీ పోలీసులను ఆ శాఖ ఏడీజీ మహేశ్ ఎం భాగవత్ అభినందించారు.