హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం కలలను సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజం చేశారని తాజాగా గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసి కుమ్రంభీం కలలను నిజం చేశారంటూ ట్వీట్ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలే కాకుండా జల్, జంగల్, జమీన్ అనే కుమ్రంభీం కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు మన కేసీఆర్ అని కొనియా డారు. గిరిజన, ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి పట్టాలతో పట్టా భిషేకం చేస్తు న్న తరుణంలో ఆడవిబిడ్డల అభ్యున్న తిలోనే ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ ఆ ట్వీట్లో పేరొన్నారు.