హైదరాబాద్, జూలై 11 (నమస్తేతెలంగాణ): తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 3న అరుణాచలగిరికి తొలిసారిగా నడిపిన సూపర్లగ్జరీ బస్సు సర్వీసులకు భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపేలా ఏర్పాట్లు చేసింది.
అరుణాచలేశ్వరుని గిరి ప్రదర్శన ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే భక్తులను అకడికి చేర్చనున్నది. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా ఆన్లైన్లో బస్సు టికెట్లు అందుబాటులో ఉంచుతారు. బస్సు సర్వీసు ముందుగా ఆంధ్రప్రదేశ్ కాణిపాకం వెళ్తుంది. అక్కడ విఘ్నేశ్వరుని దర్శనానంతరం అరుణాచలానికి చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత అదేరోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్కు వెళ్తుంది. అకడ దర్శనానంతరం తిరుగు పయనమవుతుంది. అరుణాచలగిరి ప్రదర్శన వెళ్లే భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్టు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.