హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తె లంగాణ): వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంచాలని రవాణాశాఖ నిర్ణయించింది.
బైక్కు రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లకు రూ.100, ఇత ర క్యాటగిరీ వాహనాలన్నింటికీ 100 చొప్పున ఫీజులు నిర్ణయిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏ డేండ్ల క్రితం ఉన్న చార్జీలే వసూలు చే స్తున్నారని, వివిధ వ్యయాలు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నది.