నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నదని స్థానికులు తెలిపారు. రెండ్రోజుల కిందట వ్యవసాయ పొలంలో విత్తనాలు వేస్తున్న కూలీల కంట పడిందని చెప్పారు. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
-అమ్రాబాద్