విద్యార్థి: మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింతేనా.. నా పరిస్థితి ఏమిటి..? నన్నేం చేయమంటారో చెప్పండి ప్లీజ్.
కౌన్సెలర్: చదువుతున్నప్పుడు గంటగంటకు కొంతసేపు విరామం తీసుకోండి. సిలబస్ ఎంత పూర్తిచేశారో, ఇంకా ఎంత ఉన్నదో సమీక్షించుకోండి. రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. మొబైల్ఫోన్కు వీలైనంత దూరంగా ఉండండి. రిజల్ట్స్ ఎలా ఉంటాయోనన్న టెన్షన్ను వీడి ముందు పరీక్షలు బాగా రాయడంపై దృష్టిపెట్టండి. ఫలితం దానంతటదే వస్తుంది. ఫెయిలైతే జీవితం ముగిసినట్టు కాదు. మళ్లీ ప్రయత్నించండి. బీ బ్రేవ్.
మూడు రోజుల తర్వాత అదే విద్యార్థి: మేడం మీ కౌన్సెలింగ్ నాకు ఉపయోగపడింది. మీరిచ్చిన సలహాలతో టెన్షన్ పోయింది. పాసవుతానన్న నమ్మకం ఏర్పడింది. ధ్యాంక్యూ సో మచ్.
ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో టెలిమానస్ కౌన్సెలర్, విద్యార్థి మధ్య జరిగిన సంభాషణ. సారాంశమిది.
ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల టెన్షన్ను టెలిమానస్ పో గొడుతున్నది. విపరీతమైన ఒత్తిడి, టెన్షన్, ఆత్మహత్య ఆలోచనలు ఉన్న విద్యార్థులకు సాంత్వన చేకూరుస్తున్నది. పరీక్షల నేపథ్యంలో మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ (టెలిమానస్) సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలోనే అత్యధికంగా 236 మంది టె లిమానస్ను ఆశ్రయించారు. గత 4 నెలల్లో 475 మంది ఆశ్రయించగా, వీటిలో 230 పరీక్షల ఒత్తిడికి చెందినవే ఉన్నాయి. ఉద యం, లేదా సాయంత్రం సమయాల్లోనే విద్యార్థుల నుంచి తమకు కాల్స్ అధికంగా వస్తున్నట్టు టెలిమానస్ వర్గాలు తెలిపాయి.
ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నది
ఇటీవల ఒక విద్యార్థి టెలిమానస్కు ఫోన్ చేసి.. ‘మేడం పరీక్షల టెన్షన్ను భరించలేకపోతున్నా.. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నది’ అంటూ బాధను వ్యక్తంచేశాడు. ఆ విద్యారి వ్యక్తిగత వివరాలను ఆ రా తీసిన కౌన్సెలర్.. అతడితోపాటు, తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు.