హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) తెలిపింది. టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందని వైనంపై ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 13న ప్రచురితమైన ‘ఉగాది దాటినా జీతం పడలే’ కథనానికి వైద్యారోగ్య శాఖ స్పందించింది.
వేతనాలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని, ఇంకా నిధులు విడుదల కాలేదని టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వేతనాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.