(Huzurabad) హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల వసతుల కల్పనకు 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ క్రీడా మైదానాన్ని సందర్శించిన ఆయన క్రీడాకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు దేశ భక్తి కలిగిన వారిగా గుర్తించడమే కాకుండా, సమాజంలో రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షిస్తూ జీవితాన్ని గడుపుతారని అన్నారు.
హుజురాబాద్ క్రీడా మైదానం రూపురేఖలు త్వరలో మారుస్తామని తెలిపారు. కబడ్డీ, హాకీ , క్రికెట్ తోపాటు ఇతర క్రీడాకారుల నుంచి వినతులు స్వీకరించారు. ఒక హాకీ క్రీడాకారుడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వరకు ఎదగడం చాలా గొప్ప విషయం అంటూ బండ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్ ,అంజయ్య ,యూసఫ్ ,బండరఘు, సజు ,రవీందర్ రవికుమార్ , శ్రీను ,ఉమామహేశ్వర్, , జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.