Telangana | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారికి కఠిన శిక్షలు పడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారు. ఆధారాలను పక్కాగా సేకరించి నేరాలను నిరూపించడం ద్వారా నిజమైన దోషులకు శిక్షపడేలా చూస్తున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మే 13 వరకు 63 మంది జీవిత ఖైదుకు గురయ్యారు. వారిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు, ఉమ్మడి వరంగల్లో ఆరుగురు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఆరుగురు, హైదరాబాద్కు చెందిన ఐదుగురు ఉన్నట్టు డీజీపీ అంజనీకుమార్ ట్విట్టర్లో వెల్లడించారు.
నేరాల నిరూపణలో తెలంగాణ పోలీసుల చిత్తశుద్ధి వల్ల శిక్షల శాతం క్రమంగా పెరుగున్నది. 2021లో తీవ్ర నేరాలకు సంబంధించిన 110 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టులు.. నిరుడు 152 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాయి. దీంతో లైఫ్ కన్విక్షన్స్ రేటు కేవలం ఏడాదిలోనే 38% పెరిగింది.
తెలంగాణ పోలీసులు చిత్తశుద్ధితో ఆధారాలు సేకరిస్తున్నారు కాబట్టే నేరస్థులకు సరై న సమయంలో జై లు శిక్షలు పడుతున్నాయి. ఈ విషయంలో ఎం తో నిబద్ధతతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు నా అభినందనలు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, కరుడుగట్టిన నేరస్థులను శిక్షించడం ప్రతి పోలీసు బాధ్యత. నిజమైన నేరస్థులకు శిక్ష పడేలా వ్యవహరించినప్పుడే న్యాయాన్ని కాపాడగలుగుతాం. ఆ దిశగా రాష్ట్ర పోలీసులు చేస్తు న్న ప్రయత్నాలు విజయవంతం కావాలి.
– డీజీపీ అంజనీకుమార్