హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఎవరు తయారుచేశారన్నదానిపై అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ జరిగింది. శ్వేతపత్రం ఎవరు తయారుచేశారో తనకు తెలుసని, ఇక్కడి అధికారులను నమ్మకుండా వేరేవాళ్లతో రూపొందించారని హరీశ్రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ముఖ్యమంత్రి మాజీ గురువు శిష్యులు ఇద్దరు శ్వేతపత్రం తయారీలో పాల్గొన్నారని, వారిలో ఒకరు మాజీ ఐఏఎస్ అధికారి కాగా, మరొకరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి అని హరీశ్రావు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో వారిద్దరూ ఎవరన్న చర్చ అసెంబ్లీ లాబీల్లో మొదలైంది.