హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. హైదరాబాద్లోని కేజీబీవో కార్యాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. అథారిటీ చైర్మన్ శివనందన్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పోలవరం బ్యాక్వాటర్ స్టడీస్, పీపీఏ ఆర్గనైజేషన్ బాడీలో తెలంగాణకు చోటు కల్పించడం, పోలవరం వరద ప్రవాహాల డాటాను అందజేయడం తదితర అంశాలపై తెలంగాణ అధికారులు మరోసారి తమ వాదనలు వినిపించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాయింట్ సర్వేకు ఏపీ ముందుకు రావడం లేదని, ఎన్జీటీ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో సంయుక్త సర్వే నిర్వహణకు చొరవ తీసుకోవాల్సిన బాధ్యత పీపీఏపై ఉన్నదని చెప్పారు. దీంతో పోలవరం ముంపుపై సంయుక్త సర్వేకి సంబంధించిన అంశాలపై ఇరు రాష్ర్టాల సీఈలతో కలిపి త్రిసభ్య కమిటీ వేయాలని పీపీఏ చైర్మన్ నిర్ణయించారు.