ఆదివాసుల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. సమ్మక్క-సారక్క, నాగోబా, జంగూబాయి జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సమయంలో ఆదివాసులు వైభవంగా జరుపుకొనే దండారీ వేడుకలకు ఆర్థికసాయం అందిస్తున్నది. అంతేగాకుండా హైదరాబాద్లో రూ.20 కోట్లతో ఆత్మగౌరవ భవనాలు నిర్మించింది.
– గంధం రమణ, నాయక్పోడ్ సేవా సంఘం, ప్రధాన కార్యదర్శి