హైదరాబాద్ : పరీక్ష సరిగా రాయలేదని విద్యార్థిని ఒంటిపై వాతలు వచ్చేలా(Beat the student )ఓ ఉపాధ్యాయుడు(Teacher) చితకబాదాడు. ఈ అమానవీయ సంఘటన నల్లగొండ(Nallagonda) జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని మాతశ్రీ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బొడ్డుపల్లి త్రిశూల్ తెలుగు పరీక్ష సరిగా రాయలేదన్న కారణంతో ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో బాలుడి ఒంటిపై వాతలు పడ్డాయి. గమనించిన బాలుడి తాత ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రిన్సిపాల్ సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.