హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై వరుసగా రెండో రోజు ఉభయ పక్షాలు తమ వాదనలు వినిపించాయి. మంగళవారం కూడా సుదీర్ఘంగా విచారణ జరిగింది.
చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. సెక్షన్ 17ఏ నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనలకు సమయం సరిపోకపోవడంతో కేసు విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.