హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్రి వరకు జలాలను తరలిస్తున్నారు.
లక్ష్మీ పంప్హౌస్ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్ బరాజ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి టన్నెల్స్ ద్వారా నందిమేడారం, గాయత్రి పంప్హౌస్లకు అక్కడి నుంచి వరద కాలువలోకి జలాలను తరలిస్తున్నారు. లక్ష్మి, సరస్వతి పంప్హౌజ్ల్లో ఆరు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మరోవైపు ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.