హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటుతున్నాయి. ప్రస్తుత ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండడంతో నగరంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ రాగల రెండు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.
నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.7 డిగ్రీలు పెరిగి, 32.7 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 56శాతంగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.