తాడ్వాయి, మార్చి 24: మేడారం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చ రంగేసుకున్న స్తూపం ఇప్పుడు మళ్లీ ఎర్రబారుతున్నది. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం తాడ్వాయి మండలం ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్కు ఎదురుగా)లో ఉన్న స్తూపం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చరంగు పులుముకున్నది. ఇప్పుడు మళ్లీ ఎరుపు రంగులోకి రూపాంతరం చెందడంలోని ఆంతర్యం ఏమై ఉంటుందా? అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది.
మేడారం మహాజాతర సందర్భంగా జనవరి 14న ‘నెత్తుటి స్మరణకు పచ్చని పూతలు’ శీర్షికన నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.