హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యానికి మించి సాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 74.42 లక్షల మంది పురుషులు కాగా, 83.73 లక్షల మంది మహిళలు, 10,955 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 96.21 శాతం కంటి పరీక్షలు పూర్తయ్యా యి. వీరిలో 1.18 కోట్ల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది.
మిగతా వారిలో దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 22,21,494 మందికి ఉచితంగా రీడింగ్ అద్దాలు, మందులను అందజేశారు. రెండో విడుత జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజుల కార్యక్రమంగా చేపట్టింది. 89 రోజుల్లో లక్ష్యానికి మించి రెండు కోట్ల పరీక్షలకు చేరువ అవుతున్నది. కంటివెలుగు కార్యక్రమ పురోగతిపై సీఎం కేసీఆర్ రోజువారీ సమీక్ష చేస్తున్నారు.