హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఆ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నది. తద్వారా అదనంగా మరో 16,320 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. కొత్తగా మంజూరు చేసిన డిగ్రీ గురుకుల కాలేజీలను జోగులాంబ గద్వాల, నారాయణపేట,నాగర్కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటితో కలిసి రాష్ట్రంలో మొత్తం డిగ్రీ గురుకులాల సంఖ్య 33కు చేరింది.
బీసీ గురుకులాల్లో మొత్తంగా, ప్రస్తుతం 33 గురుకులాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు, 263 గురుకులాల్లో ఇంటర్ వరకు, 16 డిగ్రీ గురుకులాలు ఉండగా, వీటిల్లో మొత్తంగా 1,82,440 మంది బీసీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నది.
దేశంలో బీసీల సమగ్ర విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సరారేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ప్రభుత్వం మంజూరు 17 డిగ్రీ గురుకులాలను మంజూరు చేయడం పట్ల మంత్రి గంగుల ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం వల్లే బీసీ గురుకులాల సంఖ్య 19 నుంచి 327కి పెరిగిందని పేర్కొన్నారు. వెనకబడిన వర్గాల జీవితాల్లో విద్య ద్వారా సమూల మార్పులు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.