Komatireddy | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమి పాలవడంతో ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో భద్రత కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు 2+2 భద్రత ఉండేదని, రాజగోపాల్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రత 1+1కు తగ్గిందని వివరించింది. తనకు 2+2 భద్రత కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని ప్రభుత్వ న్యాయవాది ఎం రూపేందర్ కోరారు. ఈ పిటిషన్పై మంగళవారం జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టడంతో.. మాజీ ఎమ్మెల్యేలకు 1+1 భద్రత కల్పిస్తున్న విషయాన్ని పిటిషనర్ అఫిడవిట్లో పేరొనలేదని రూపేందర్ ఆక్షేపించారు.
అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలకు అసాధారణ పరిస్థితుల్లోనే 2+2 భద్రత కల్పించేందుకు ఆసారం ఉంటుందని తెలిపారు. రాజగోపాల్ విషయంలో అలాంటి పరిస్థితులేమీ లేనందున భద్రత పెంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రాజగోపాల్కు ప్రాణహాని ఉన్నదని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత దాడి కూడా జరిగిందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు 2+2 భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ అంశంపై డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ పదిరోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.