హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): గొర్ల పంపిణీలో నగదు బదిలీకి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రెండో దశ పంపిణీలో భాగంగా సుమారు 7వేల మంది లబ్ధిదారులకు రూ.93 కోట్ల నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది. గొర్లకు బదులుగా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయటంపై ఆ రెండు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. దీనితో ప్రభుత్వం అనుమతించింది.