మేడ్చల్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో రైతుల ముసుగులో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేయడాన్ని అడ్డుకొన్నందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు. తప్పుడు పత్రాలతో భూములు కాజేసే ప్రయత్నాలను తాము అడ్డుకోవటంతో కబ్జాకారులు రైతుల పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టి ధరణినే వణికించే దగాకు తెగబడ్డారని ఆరోపించారు. పలు పత్రికల్లో శుక్రవారం ప్రకటనలు ఇచ్చి అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ కేసుల పరంపర
బొమ్మరాసిపేట పరిధిలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు ఉన్న వాటిలోని 1,049 ఎకరాల భూములపై వివాదాలు, కోర్టు తీర్పులను అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. ‘ఈ 1,049 ఎకరాల భూమి హక్కుదారులైన మీర్ రెహ్మత్ అలీతో పాటు మరో ఆరుగురి నుంచి దుగ్గిరాల బలరామకృష్ణ 1965లో కొనుగోలు చేశారు. ఆయన దుగ్గిరాల అమరేంద్రబాబు, మరో 20మంది పేరిట సేల్డీడ్ చేశారు. 1966లో పార్టిషన్ డీడ్ చేయించుకొని, మ్యుటేషన్ చేయించుకోవడమే కాకుండా పహాణీల్లో కూడా నమో దు చేయించుకొన్నారు. అప్పటినుంచి ఆ భూములు పూర్తిగా వారి స్వాధీనంలోనే ఉన్నాయి. తదనంతరం కాలంలో ఈ హక్కుదారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని కొందరు ఆ భూము లు కాజేయాలని పథకం రచించారు. అందుకోసం ఒక నకిలీ సాదా బైనామా సృష్టించారు. అప్పటి తహసీల్దార్ 1981లో రైగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అ సమయంలో సాదాబైనామాను రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్కు లేదు.
అన్ రిజిస్టర్ సేల్డీడ్ లేదా సాదా బైనామాలకు అనుమతిస్తూ 1989లో చట్టం చేయబడింది. అంతకుముందు ఇలాంటి డ్యాక్మెంట్లను రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్లకు లేదు. కానీ, కబ్జాదారులతో చేతులు కలిపి అప్పటి అధికారు లు నకిలీ సాదాబైనామాను రెగ్యులరైజ్ చేశారు. ఆ విషయం ఆ తర్వాత న్యాయస్థానాల్లో బయటపడ్డది. అ సాదాబైనామా నకిలీదని తేలిపోయింది. ఉన్నతస్థాయి నిర్ధారణ జరిగేలోపు కల్లెపల్లి సత్యనారాయణతోపాటు మరో 14 మంది, టీ హరినాథ్తో కలిసి మరో ఆరుగురు, అలాగే ఆళ్ల బలరామకృష్ణ మరికొంత మంది అక్రమ పద్ధతుల్లో రెవెన్యూ రికార్డులోకి వచ్చా రు.
రెగ్యులరైజ్ చేసుకొని 1980-81, 1981-82లో వారిపేర్లు ఫైసల్ పట్టిలో వచ్చేట్టు చేసుకున్నారు. తహసీల్దార్ ఉత్తర్వులపై భూమి హక్కుదారులు రంగారెడ్డి జిల్లా ఆర్డీవో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తహసీల్దార్ ఉత్తర్వులను పరిశీలించిన ఆర్డీవో సదరు సాదాబైనామా చెల్లుబాటుకాదని 1999 ఏప్రిల్ 12న ఆదేశాలిచ్చారు. హరినాథ్తోపాటు మరో ఆరుగురి పేరున మ్యుటేషన్ చేస్తూ ఆర్ఓఆర్లో నమోదు చేయడాన్ని కూడా ఆర్డీవో న్యాయస్థానాలు తప్పుబట్టాయి. ఆర్ఓఆర్ రికార్డులు, పహాణీల నుంచి వారి పేర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశాయి. దీనిపై అళ్ల బలరామకృష్ణ, మరో ఐదుగురు కలిసి రంగారెడ్డి జేసీన్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సాదాబైనామా చెల్లుబాటు కాదని 24-05-1999లో ఉత్తర్వులు జారీ చేశారు’ అని అధికారులు వెల్లడించారు.