నవీపేట, జూలై 29: ఇంట్లో నిద్రిస్తున్న రెండేండ్ల బాబును రెండు పాములు కాటేయడంతో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతుల కొడుకు రుద్రాన్ (2) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటిపైకప్పు నుంచి పడిన రెండు పాములు బాబును కాటేశాయి. బాబు ఏడవడంతో గమనించిన తల్లి వెంటనే పాములను పట్టుకొని బయటికి విసిరేసింది. బాలుడిని జిల్లా వైద్యశాలకు తరలించగా చికి త్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.