మహబూబాబాద్ : దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహబూబాబాద్లో రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.
రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఎముకలు కొరికే చలిలో రైతులను ఏడాది పాటు ఇబ్బంది పెట్టిన దేశ ప్రధానినే పంజాబ్లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారని, మిగిలిన బీజేపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి హెచ్చరించారు. బిజెపి నేతలు నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే వారికి పుట్టగతులు ఉండవన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం వంటి భారీ బహుళసార్థక ప్రాజెక్టు నిర్మించడం, రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టడం వల్ల తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారన్నారు.
తెలంగాణ రైతుల కల్లాల్లో పుష్కలమైన ధాన్యాన్ని చూసి కండ్లు మండి, ఓర్వలేక బీజేపీ నేతలు తెలంగాణ ధాన్యాన్ని కొనడం లేదని, మా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే పద్ధతి కొనసాగితే బిజెపికి ఇక్కడ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్ల వలె రాష్ట్రంలో పర్యటిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ రాష్ట్రంలో గెలువని నేతలు ఇక్కడ వచ్చి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు.
రైతుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకే ఈ రైతుబంధు సంబరాలు చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జేడీ చత్రు నాయక్, పాక్స్ చైర్మన్ రంజిత్, కో ఆప్షన్ సభ్యుడు పాషా, తదితరులు పాల్గొన్నారు.