గద్వాల అర్బన్, మే 30 : నడిగడ్డ హక్కుల సమితి నేత రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పెట్టుకొని దాడులు చేస్తున్న ఘటనలు జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ధరూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డిపై నడిగడ్డ హక్కుల సమితి నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు.
ఉద్దేశపూర్వకంగానే అతడితో గొడవకు దిగారు. విచక్షణా రహితంగా కుర్చీలు, కట్టెలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో శ్రీనివాస్రెడ్డికి తల, నడుము భాగంలో బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకునేందుకు వెళ్లగా.. వారిపైనా దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయానికి చేరుకొని దాడికి కారణమేమిటని నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్ బీఆర్ఎస్ నేతలకు నచ్చజెప్పి పంపారు.