Summer | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్జన్ మంగళవారం సలహాలు, సూచనలు జారీ చేశారు.
ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పారు. పార్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.