దౌల్తాబాద్, సెప్టెంబర్ 28: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా పంచాయతీలోని భాగ్యతాండ వాసులు బీఆర్ఎస్కు జైకొట్టారు. కాంగ్రెస్ నాయకుడు వాల్యానాయక్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు రవినాయక్, బాలిబాయి, టికిబాయితోపాటు 300 మంది యువకులు, గిరిజనులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వీరికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా పోల్కంపల్లి, దేవర్ఫస్లవాద్ గ్రామాలకుచెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరారు.