యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మంత్రికి ఆలయ ప్రధానార్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా, ఈవో రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.