కాళేశ్వరం, జూలై24: కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది తగ్గుతూ వస్తున్నది. సోమవారం 9.30 మీటర్ల ఎత్తులో 5.11 లక్షల క్యూసెక్కులతో ప్రవహిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ(అన్నారం) బరాజ్లో సోమవారం 32 గేట్లు ఎత్తి 75799 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బరాజ్కు పార్వతి బరాజ్, మానేరు వాగు నుంచి 94910 క్యూసెక్కుల నీరు వస్తోంది. 10.87 టీఎంసీలకు 6.668 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మీ బరాజ్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది..ఆదివారం 5,49,210 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం 5,11,480 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్లోని 84 గేట్లకు 75 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ ప్రస్తుత నీటిమట్టం 6.7 మీటర్లుగా ఉందని ఆయన తెలిపారు.