నిజామాబాద్ నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 13: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు రైతాంగా న్ని ఆగం చేస్తున్నాయి. కోటగిరి, వర్ని, చందూరు, రుద్రూరు, రెంజల్, బోధన్, ఆర్మూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్పల్లి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఇటీవల కురిసిన వడగండ్లతో కుదేలైన తరుణంలో వరుణుడు మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. కోతకొచ్చిన పైర్లు నేలవాలాయి.