ములుగు, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి. దవాఖానలో ఉన్న గర్భిణుల్లో కొండాయి గ్రామానికి చెందిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
గ్రామంలో వరద ఉధృతి తగ్గడంతో పుట్టిన బిడ్డతోపాటు కేసీఆర్ కిట్ను తీసుకొని ట్రాక్టర్లో బయలుదేరింది. రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి కొండాయి గ్రామంలో వరద బాధితులకు సహాయం అందించేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా అందులోనే కేసీఆర్ కిట్తో తల్లీబిడ్డ ప్రయాణించారు. ఈ దృశ్యాన్ని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.