సంగారెడ్డి : బంగారం దొంగలించిన(Gold stolen) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి 96 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ఉస్మాన్నగర్ విల్లాస్లో గత సంవత్సరం 25న చోరీ జరిగింది. విల్లాస్లో ఉండే మహిళ ఢిల్లీ వెళ్లిన సమయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కాగా, సదరు మహిళ ఇంట్లో పని చేసే ఒడిశా వాసి ప్రభాకర్ చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.