హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూస్థాపితమైపోయిన బీజేపీ.. ఎన్నికల్లో గెలిస్తే బీసీని సీఎం చేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.. కేంద్రమంత్రి అమిత్షా అబద్ధాల అనకొండగా మారారని విమర్శించారు. అమిత్ షా చేసిన బీసీ సీఎం హామీ బూటకమేనని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తెలుసుకోగలిగే విజ్ఞత తెలంగాణ ప్రజలకు ఉనదని తెలిపారు.
తెలంగాణ ప్రజలు బీజేపీని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ 2014లో వెనుకబడిన వర్గాల నాయకుడని నరేంద్ర మోదీని చూపించి.. అధికారం దకించుకొని.. ఆ తరువాత బీసీలకు చేసిన మేలేమిటో చెప్పాలని సవాల్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీలను దారుణంగా అణచివేసిన బీజేపీ తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టాలని బూటకపు నినాదం ఎత్తుకున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పగటికలేనని తేల్చిచెప్పారు. కేంద్రమంత్రి అమిత్షాకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.