హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైనదని, అతి త్వరలో మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితరరాష్ట్రాల్లో ఆఫీసులు ఏర్పాటు కానున్నాయని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు. అన్ని రాష్ర్టాల్లోని పార్టీ కా ర్యాలయాలు న్యూ ఢిల్లీ, హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కా ర్యాలయాలతో అనుసంధానిస్తారని శుక్రవారం ఒక ప్రటకలో తెలిపారు.
దేశంలో బీఆర్ఎస్ వాయువేగంతో విస్తరిస్తున్నదని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అమితమైన ఆదరణ లభిస్తున్నదని, మహారాష్ట్రలో పార్టీ ప్రకంపనలు సృష్టిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లా ల్లో బీఆర్ఎస్ విస్తరించడంతో అకడి సరార్లో గుబులు పుడుతుందని నామా పేర్కొన్నారు.