హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాపు అనుబంధ కులాల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం సీఎం కేసీఆర్ 6.87ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు. కాపు కమ్యూనిటీకి భూమి కేటాయించడంలో చొరవ చూపిన చంద్రశేఖర్ను యాళ్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ కాపు సంఘాల నాయకులు ఆదివారం హైదరాబాద్లో గజమాలతో ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతూ వారి అభ్యున్నతిని మరిచాయని మండిపడ్డారు.
ఏపీలో కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 2 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మొండి చేయి చూపి కాపు జాతిని మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా కాపు సంక్షేమ భవనం కోసం సీఎం జగన్ రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోట మధు, ప్రముఖ డాక్టర్ నాగార్జున, శ్రీనివాసుల కృష్ణ, తోట ప్రవీణ్ నాయుడు, మర్రిశెట్టి మురళి, కాపు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.