చివ్వెంల, మార్చి 31 : హరిత హారంలో నాటిన మొక్కల ను నరికిన వ్యక్తికి పంచాయతీ అధికారులు రూ. 6.64 లక్షల జరిమానా విధించారు. సూర్యాపే ట జిల్లా చివ్వెంల మండలం సూర్యానాయక్తండాకు చెందిన స్టోన్ క్రషర్ మిల్లు యజమాని భూక్యా బాలు.. సూర్యాపేట – ఖమ్మం రహదారి వెంట ఎస్సారెస్పీ కాల్వ పక్కన ఉన్న దాదాపు 143 హరితహారం చెట్లను మార్చి 20న నరికివేశాడు.
ఈ విషయమై శుక్రవారం ఎంపీడీవో లక్ష్మి, విచారణ చేపట్టి రూ. 6.64 లక్షల జరిమానా విధించారు. జరిమానాను వారంలో చెల్లించాలని సూచించారు.