Palamuru-Rangareddy Lift Irrigation | ప్రాజెక్టుల నిర్మాణంలో కాకతీయుల స్ఫూర్తితో ముందుకుసాగుతున్న తెలంగాణ సర్కారు కొండగుట్టలనే ఆనకట్టలుగా చేసుకొని భారీ జలాశయాలను నిర్మిస్తున్నది. కొండలను కలుపుతూ కిలోమీటర్ల మేర రిజర్వాయర్లను నిర్మిస్తూ సాంకేతిక అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్గా మా రుతున్నది. కాళేశ్వరంతోపాటు ప్రారంభానికి సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి పథకంలోని ప్రతి జలాశయమూ ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి సర్జ్పూల్లోకి నీటి విడుదలను విజయవంతంగా పరీక్షించారు. మంగళవారం టెస్టింగ్ రన్ నిర్వహించారు. అంతకుముందు హెడ్రెగ్యులేటరీ వద్ద పూజలు నిర్వహించి కృష్ణా జలాలను టన్నెల్లోకి.. ఆ తర్వాత సర్జ్పూల్లోకి తరలించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి వచ్చిన జలాలను రెగ్యులేటరీ గేటును 4 మీటర్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించి నార్లాపూర్ వద్ద మహాబాహుబలి పంపులను స్విచ్ ఆన్చేసి నీటి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే టెస్టింగ్ రన్ నిర్వహించినట్టు చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అప్రోచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు టన్నెల్లోకి ప్రవేశించి సర్జ్పూల్లోకి వెళ్లడంతో ఇరిగేషన్ అధికారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. టెస్టింగ్ రన్ విజయవంతం కావడంతో ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు.
పాలమూరు ట్రయల్న్ సక్సెస్
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెస్ట్న్ల్రో భాగంగా నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి టన్నెల్ ద్వారా సర్జ్పూల్లోకి ప్రవేశిస్తున్న కృష్ణా జలాలు
సర్జ్పూల్లో 30 మీటర్లకు చేరిన జలాలు
శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్రెగ్యులేటరీ వద్ద ఉన్న కృష్ణా జలాలను గేటు ఓపెన్ చేసి టన్నెల ద్వారా సర్జ్పూల్లోకి పంపించే ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. ఇంజినీరింగ్ సిబ్బంది, ఏజెన్సీ ఇంజినీర్లు కలిసి హెడ్రెగ్యులేటరీ గేట్ ఎత్తడంతో కృష్ణమ్మ బిరాబిరా టన్నెల్లోకి ప్రవేశించింది. ఈ అపూర్వ ఘట్టం విజయవంతం కావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు. 74 మీటర్ల ఎత్తున్న సర్జ్పూల్లో 30 మీటర్ల మేర నీటిని నిల్వ చేయనున్నారు. దశల వారీగా నీటిని సర్జ్పూల్లోకి ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా? అని పరిశీలించనున్నారు. సర్జ్పూల్లోకి హైరిజల్యూషన్ కెమారాలను బిగించి కంట్రోల్ రూం ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. లీకేజీలు ఉంటే ఈలోపు సరిచేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.