Minister KTR | హైదరాబాద్: నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారమవుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI) ఆవిష్కృతమవుతున్నదని, తెలంగాణ జలవిజయ పతాకం సగర్వంగా ఎగురుతున్నదని చెప్పారు. తెలంగాణ సాగునీటిరంగంలో పీఆర్ఎల్ఐ మరో కాళేశ్వరమని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ.. కుట్రలను, కేసులను గెలుస్తూ జలసంకల్పంతో అనుమతులు సాధించామన్నారు. దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్నదని తెలిపారు. బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్లందించనున్నదని చెప్పారు. ఇది తెలంగాణ జలశక్తి అని, కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి అని ట్వీట్ చేశారు.
ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!
సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.
ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ…
కుట్రలను, కేసులను గెలుస్తూ..
జలసంకల్పంతో… pic.twitter.com/qBmu9SHyo7— KTR (@KTRBRS) September 4, 2023